టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.గడిచిన నాలుగేళ్లలో బీసీలకు ప్రత్యేకంగా ఏం చేశారని ప్రశ్నించారు.

బలహీన వర్గాలంటే వైఎస్ కుటుంబానికి కక్ష అని ఆరోపించారు.బీసీల కోసం టీడీపీ ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.

బీసీలకు టీడీపీ ఏం చేసిందో ఆ లెక్కలు జగన్ వద్దే ఉన్నాయని తెలిపారు.

2018 లో టీడీపీ ప్రభుత్వం జయహో బీసీ పేరిట నిర్వహించిందన్న ఆయన వైసీపీ సర్కార్ అదే పేరు పెట్టుకుందని ఎద్దేవా చేశారు.

కోర్టు ముందుకు సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితులు..!