అమెరికాలో దారుణం: కసితీరా పొడిచి పొడిచి… భార్యను చంపిన భారతీయుడు

విదేశాల్లో భర్తల చేతుల్లో హత్యకు గురవుతున్న భారతీయ మహిళల ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి.

దుబాయ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడిన ఓ వ్యక్తికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనను మరిచిపోకముందే అమెరికాలో మరో దారుణం జరిగింది.భార్యను కట్టుకున్న భర్తే కత్తితో పొడిచి పొడిచి దారుణంగా హతమార్చాడు.

కేరళకు చెందిన మెరిన్ జాయ్ దక్షిణ ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్‌లో గల బ్రోవార్డ్ హెల్త్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తోంది.

ఈ క్రమంలో మంగళవారం నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు పార్కింగ్ గ్రౌండ్‌కు వెళ్లింది.

కారును తీసేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మెరిన్ జాయ్‌‌ను వెనుకు నుంచి కత్తితో పొడిచాడు.

తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడివున్న ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే జాయ్ అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.

"""/"/ కేసు నమోదు చేసుకున్న కోరల్ స్ప్రింగ్స్ పోలీసులు జాయ్‌‌ను ఆమె భర్త ఫిలిప్ మాథ్యూనే హత్య చేసినట్లు తేల్చారు.

అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే అతను తనకు తాను గాయాలు చేసుకుని హాస్పిటల్‌లో చేరాడు.

కుటుంబ గొడవల కారణంగానే ఫిలిప్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.మెరిన్ జాయ్, ఫిలిప్ మాథ్యూలకు ఒక బాబు ఉన్నాడు.

బాబును కేరళలోని తమ సొంత గ్రామం పిర్వంలోనే వుంచాలని మ్యాథ్యూ.భార్య మెరిన్‌తో గొడవ పడ్డాడు.

దీంతో ఆమె పిల్లాడిని అక్కడే వదిలేసి భర్తతో కలిసి అమెరికాకు వచ్చేసింది.ఇక్కడ కూడా దంపతులిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

అయితే కలహాలు తారాస్థాయికి చేరి చివరికి మెరిన్ హత్యకు దారితీసింది.

నాని రాజమౌళి కాంబినేషన్ రిపీట్ కానుందా.. ఈగ సీక్వెల్ ను అలా ప్లాన్ చేశారా?