లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం..!!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఇవాళ విచారణ దూరంగా ఉండాలని నిర్ణయించారు.

కేజ్రీవాల్ తాజా నిర్ణయంతోఈడీ విచారణకు( ED Probe ) వెళ్తారా ? లేదా ? అన్న దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ విచారణ రావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా ఇప్పటికే రెండు సార్లు విచారణకు వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.

అయితే మూడోసారి వెళ్లకపోతే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే న్యాయవాదులతో ఆప్ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ భారీ పోటీ ఇస్తుందా..?ఇక అందులో నలుగురి స్టార్ హీరోల పాత్ర ఉందా..?