ద‌స‌రాపై క‌న్నేసిన కీర్తి సురేష్.. వ‌ర్కౌట్ అవుతుందా?

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ టైం నడుస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ మ‌హ‌మ్మారికి ఎదురెళ్తే.

ప్రాణాల‌తో చెల‌గాట‌మే అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఏర్ప‌డింది.దీంతో ఎక్క‌డి వారు అక్క‌డే లాక్ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి.షూటింగ్లు ఆగిపోయాయి.

అయితే ఇటీవ‌ల అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం షూటింగ్స్‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో.

మ‌ళ్లీ సెల‌బ్రెటీలు ముఖానికి రంగు వేసుకుంటున్నారు.అయితే షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి.

కానీ, థియేట‌ర్లు మాత్రం ఓపెన్ అవ్వలేదు.ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా క్లారిటీ రావ‌డం లేదు.

దీంతో సినిమాల‌న్నీ ఓటీటీ ద్వారా విడుదల అయ్యేందుకు క్యూ క‌డుతున్నారు.ఇక ఇటీవ‌ల మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ కూడా `పెంగ్విన్` సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు కీర్తి సురేష్ న‌టిస్తున్న `మిస్ ఇండియా` చిత్రం కూడా ఓటీటీలోనే విడుద‌ల కానున్న‌ట్టు టాక్‌.

నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో.జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర​ ప్రసాద్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.

ఈ చిత్రం ఏప్రిల్‌ 17న విడుద‌ల కావాల్సి ఉంది.కానీ, క‌రోనా కార‌ణంగా అది జ‌రిగ‌లేదు.

ఇక తాజాగా ఈ సినిమాకు ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను ద‌స‌రా పండ‌గ‌కు స్ట్రీమింగ్ చేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌.మ‌రి ద‌స‌రాపై క‌న్నేసి మిస్ ఇండియాగా రాబోతున్న కీర్తి.

ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

యూకే సార్వత్రిక ఎన్నికలు .. ఓటమికి నాదే బాధ్యత, రిషి సునాక్ భావోద్వేగం