కేసిఆర్ ను తరతరాలు గుర్తుపెట్టుకుంటారు – టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : హెలిక్యాప్టర్లో హైదరాబాదు నుంచి సిరిసిల్ల కు వచ్చేటప్పుడు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన జలాశయాలు, పలు అభివృద్ధి నిర్మాణాలు అన్ని చూపెట్టుకుంటూ వచ్చారు.

ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, గౌరవెల్లి ప్రాజెక్ట్, అనంతగిరి జలాశయం మద్య మానేరు జలాశయాలను గగనతల నుంచి టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి కేటిఆర్ చూపించారు.

కేసిఆర్ నాయకత్వంలో ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమైందనీ చెప్పాను.కేటీఆర్ చెప్పింది అంత విన్న టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒకటేమాట అన్నారు.

తెలంగాణ సాధించినందు వల్ల కేసీఆర్ గారి పేరు ఎలా అయితే చరిత్రలో నిలిచిపోయిందో.

తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గారి పేరును తరతరాల పాటు గుర్తు పెట్టుకుంటారు.

"అని టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేటీఆర్ అన్నారు.ఆ విషయాన్ని కే టి ఆర్ సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు.

ఈఫిల్ టవర్ దగ్గర అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఇండియన్.. వీడియో చూస్తే..