లిక్కర్‎కు కేసీఆర్ నడక నేర్పారు.. ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ కల్తీ అవుతోందని ఆరోపణలు గుప్పించారు.

తెలంగాణలో లిక్కర్ కు సీఎం కేసీఆరే నడక నేర్పారని విమర్శించారు.లిక్కర్ పాలసీని దేశం అంతటా తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.

తెలంగాణలో నదులు పారకుండా లిక్కర్ పారుతోందన్నారు.యాదాద్రిని తామే అభివృద్ధి చేశామని కేసీఆర్ అంటున్నారన్న ఎంపీ లక్ష్మణ్ దేవాలయాలకు ఇచ్చే ప్రజల సొమ్ము ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు.

ప్రాజెక్టుల పేరుతో పేదల భూములను కేసీఆర్ లాక్కున్నారని ఆరోపించారు.

Sangharshana” Set For August 9 Theatrical Release