కెసిఆర్ నోట షర్మిలమ్మ మాట! డబ్బు కట్టలతో ఒడిస్తారా? అంటూ ఫైర్!

తెలంగాణ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించాలని సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ఆర్ టి పి అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) అధికార బి ఆర్ఎస్ నేతలే లక్ష్యం గా అనేకసార్లు తన పాదయాత్ర లలో విమర్శలు వర్షం కురిపించేవారు .

కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ లోని కీలక నేతలను చీల్చి చెండాడే విధంగా మాటల తూటాలు పేల్చే వారు .

అయినా కూడా ఎప్పుడూ షర్మిల మాటలకు కేసీఆర్( CM KCR ) బదులిచ్చిన సందర్భం ఎప్పుడూ ఎదురవ్వలేదు .

అసలు షర్మిల పేరు తీయడానికి కూడా ఆయన ఇష్టపడనట్టుగా వ్యవహారం ఉండేది .

అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అంది వచ్చిన ప్రతి గడ్డిపోచని అస్త్రం గా ప్రయోగించాలని చూస్తున్న కేసీఆర్ మొదటిసారి షర్మిల పేరును ఎత్తుకున్నారు.

"""/" / నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ చరిత్రలో నర్సంపేటకు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, సమైక్యవాదులు వాళ్ళ చెంచాలు మనమీద పెత్తనం చెలాయించాలనుకున్నప్పుడు సుదర్శన్ రెడ్డి నిరసన తెలిపారని, దాంతో సుదర్శన్ రెడ్డి ( Sudarshan Reddy )మీద షర్మిల పగ పట్టిందట, డబ్బు కట్టలు పంపించి ఓడించాలని చూస్తుందని, డబ్బు కట్టలు గెలుస్తాయో? మిషన్ భగీరథ నీళ్లు గెలస్తాయో నర్సంపేట ప్రజలు చెప్పాలంటూ కేసిఆర్ వాఖ్యానించారు.

"""/" / పరాయి రాష్ట్రం వాళ్ళు డబ్బు సంచులు పంపితే మనం ఓడిపోతామా అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు .

సుదర్శన్ రెడ్డి ప్రజల మనిషని, ఎప్పుడూ తన నర్సంపేట నియోజకవర్గం గురించే ఆలోచిస్తారని, హైదరాబాద్కు ఆయన రావడమే తక్కువని, వచ్చినా కూడా తన నియోజకవర్గం గురించే మాట్లాడుతారని ఆయన నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆ అభివృద్ధి కొనసాగాలి అంటే ఆయనను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందంటూ ఆయన నర్సంపేట ప్రజలను కోరారు.

ఏది ఏమైనా ఇంతకాలం షర్మిళ ది తన స్థాయి కాదన్నట్లుగా కనీసం పేరు పలకడానికి కూడా ఆసక్తి చూపని కేసీఆర్ ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ఆంధ్ర ప్రాంతపు సమీకరణం తీసుకురావడం కోసమే షర్మిల పేరు ఎత్తకున్నట్లుగా తెలుస్తుంది.

మరి కెసిఆర్ ఎత్తుకున్న అస్త్రం పనిచేస్తుందో లేదో చూడాలి.

టెల్ అవీవ్ దాడి: బిడ్డను రక్షించేందుకు ఇజ్రాయెల్ మహిళ ప్రాణాలు త్యాగం..