డబ్బు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్..: రేవంత్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.ఈ మేరకు కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై స్పందించారు.
కాంగ్రెస్ డిక్లరేషన్లను, గ్యారెంటీలను కేసీఆర్ కాపీ కొట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.తాము పెన్షన్ రూ.
4 వేలు ప్రకటిస్తే ఎలా సాధ్యమని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఇప్పుడు వారి మ్యానిఫెస్టోలో రూ.
5 వేలు ఇస్తామని ఎలా ప్రకటించిందని ప్రశ్నించారు.కర్ణాటకలో డబ్బు పట్టుబడితే తమకేం సంబంధమని నిలదీశారు.
ఇండియా కూటమిలో చేర్చుకోవాలని వేల కోట్ల ఆశ చూపెట్టారని ఆరోపించారు.అదేవిధంగా డబ్బు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో మందు, డబ్బు లేకుండా ఎన్నికలకు వెళ్దామన్న రేవంత్ రెడ్డి దీనిపై ఈనెల 17వ తేదీన అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు.
చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ మీకోసం!