కేసీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం
TeluguStop.com
దక్షిణ భారత్ పై ప్రధానమంత్రి మోదీ విషం కక్కుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) అన్నారు.
తెలంగాణకు రావాల్సిన హక్కును లెక్కల్లో చూపుతున్నారని తెలిపారు.రొటీన్ గా వచ్చే దానిని లెక్కల్లో చూపడం అవివేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాకు కేంద్రం నుంచి నిధులు తేలేదన్న ఆయన బండి సంజయ్, గంగుల కమలాకర్( Bandi Sanjay , Gangula Kamalakar ) ఇద్దరూ స్నేహితులని తెలిపారు.
వినోద్ ను ఓడించేందుకు గతంలో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.పేదల భూములు లాక్కున్నవారిని వదిలి పెట్టమని పేర్కొన్నారు.
అదేవిధంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని తెలిపారు.ఆగస్ట్ 15 వ తేదీ వరకు రూ.
2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.
చిన్న సినిమాలకు ఆదరణ తగ్గడానికి కారణం ఏంటి..?