ఈరోజు ఆ యిద్దరు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్న సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.విమల విహార్ మెట్రో స్టేషన్ పక్కన 1,300 గజాల స్థలంలో టిఆర్ఎస్ పార్టీ భవంతికి భూమి పూజ చేయటం తెలిసిందే.

అనంతరం నిన్న సాయంత్రం ప్రధాని మోడీ తో కేసీఆర్ భేటీ అయ్యారు.దాదాపు 16 అంశాలకు సంబంధించి కెసిఆర్ కి వినతిపత్రాన్ని అందించడం మాత్రమే కాక.

కొత్త జిల్లాలకు కొత్త ఐఏఎస్ లు నియమించాలని.రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వివాదం విషయంలో పరిష్కారం చూపే దిశగా మోడీ తో కేసీఆర్ చర్చించడం జరిగింది.

అంతేకాకుండా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన తరఫున రహదారులు.

అనుమతుల కోసం కూడా ఈ భేటీలో చర్చించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.

వరుస సమావేశాలతో ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ కాబోతున్నారు.

తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్ వల్లే సాధ్యం అవుతుందా..?