కవితకు షాక్.. జంతర్ మంతర్ వద్ద దీక్షకు అనుమతి రద్దు
TeluguStop.com
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టనున్న దీక్షకు అనుమతులు రద్దు అయ్యాయి.
ఈ మేరకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత ధర్నా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
రేపు ధర్నా ఉండగా ఆఖరు నిమిషంలో అనుమతులు రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది.
చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు.
మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.బీజేపీ బిల్లు అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు.
తమ దీక్షకు విపక్షాలు మద్ధతు ఇచ్చాయని తెలిపారు.
మరీ ఇంత దారుణమా.. స్కూటర్తో ఢీకొట్టి.. మనిషిని అక్కడే వదిలేసి వెళ్లిపోయిన మహిళ!