ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి.. ఈటల జమున

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తీవ్రంగా మండిపడ్డారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈటల కృషి చేస్తున్నారని తెలిపారు.అయితే కొందరు చిల్లర గాళ్లు అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఈటల వలనే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్న జమున ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసే పనులకు కేసీఆర్ మూల్యం చెల్లించుకోకతప్పదని తేల్చి చెప్పారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పదవి నుంచి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఈటల జమున డిమాండ్ చేశారు.

నేడు తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ..!!