నాగార్జున బాటలో నడుస్తున్న కార్తికేయ.. ఏమైందంటే..?

యంగ్ హీరో కార్తికేయ సినీ కెరీర్ లో ఆర్.ఎక్స్ 100, నాని గ్యాంగ్ లీడర్ మినహా మరే సినిమాలు హిట్ కాలేదు.

హిట్ కంటే ఫ్లాపులు ఎక్కువగా ఉన్నా నటుడిగా మంచి గుర్తింపు ఉండటంతో కార్తికేయకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

ఆర్.ఎక్స్ 100 సినిమాలో కార్తికేయ అద్భుతంగా నటించడంతో కొత్త సినిమా ఆఫర్లు కార్తికేయను వెతుక్కుంటూ వస్తున్నాయి.

అయితే ఈ యంగ్ హీరో గురించి ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

హీరో కార్తికేయ నాగార్జున బాటలో నడుస్తున్నట్టు తెలుస్తోంది.నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

హీరో కార్తికేయ కూడా తన తరువాత సినిమాలో ఇదే పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

యంగ్ హీరో కావడం, ఫిట్ గా ఉండటంతో కార్తికేయ ఈ రోల్ కు సూట్ అవుతారని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాకు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది.కార్తికేయకు జోడీగా ఈ సినిమాలో తాన్య రామచంద్రన్ నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.ఎన్నైఏ ఆఫీసర్ రోల్ తోనైనా కార్తికేయ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

గత నెలలో కార్తికేయ హీరోగా నటించి విడుదలైన చావుకబురు చల్లగా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

సుధాకర్ కోమాకుల ఈ మూవీలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శ్రీ సరిపల్లి స్టార్ డైరెక్టర్ వినాయక్ శిష్యుడు కావడం గమనార్హం.

కోలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న తాన్యా రామచంద్రన్ తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాల్సి ఉంది.

కాంగ్రెస్ ప్రక్షాళన దిశగా రాహుల్ .. సొంత టీం ఏర్పాటు ?