అయ్యో పాపం: వంటలక్క, డాక్టర్ బాబు ఫాన్స్ కి ఎన్ని కష్టాలో…?
TeluguStop.com
క్రికెట్ ను డామినేట్ చేసిన సీరియల్స్ ఉంటాయంటారా? అందులోనూ మన తెలుగు సీరియల్స్.
నమ్మబుద్ధి కావట్లేదు కదూ.కానీ, మీరు ఈ స్టోరీ వింటే ముక్కున వేలేసుకుంటారు.
నిజం.కరోనా వైరస్ కారణంగా ఇంచుమించు అందరూ ఖాళీ పడ్డారు.
ఇక ఖాళీగా ఉన్న క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 రెడీ అవుతోంది.
మరో 15 రోజుల్లో యూఏఈ వేదికగా ఈ పండగ మొదలు కానుంది.సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే.
ఇకపోతే గత సీజన్లలో పోలిస్తే.అరగంట ముందే ఈ ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం అయ్యే అవకాశముంది.
ఎలా అంటే.మధ్యాహ్నం 4 గంటలకి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 3.
30 కు, అలాగే రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 7.
30కి మొదలయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి.ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్.
"""/"/
ఈ క్రమంలో ఐపీఎల్ టైమింగ్స్ మార్చాలంటూ ఓ తెలుగు క్రికెట్ అభిమాని తన బాధను సోషల్ మీడియా వేదికగా విన్నవించుకున్నాడు.
అవును.'శివ చరణ్' అనే ట్విటర్ యూజర్ సౌరవ్ గంగూలీ, చెన్నై ఐపీఎల్, స్టార్ మా ను ట్యాగ్ చేస్తూ.
"సౌరవ్ గంగూలీ సర్.! దయచేసి మన ఐపీఎల్ టైమింగ్స్ రాత్రి 7.
30 నుంచి 8.00 గంటలకు మార్చండి.
ఎందుకంటే, 7.30 సమయానికి మా ఇంట్లో ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తారు.
లేదంటే గొడవలు అయిపోతాయి.అసలే మా ఇంట్లో ఒకే టీవీ ఉంది.
" అని పేర్కొన్నాడు.అయితే దీనికి స్టార్ మా స్పందించడం గమనార్హం.
"ఇది చాలా నిజాయితీతో కూడి అభ్యర్థన" అంటూ సదరు వ్యక్తికి బదులిచ్చింది.ఇపుడు ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అయిపోతోంది.
ఇంట్లోకి తరచూ పాములు వస్తున్నాయా.. ఇలా చేశారంటే వాటితో ఇకపై నో టెన్షన్!