కార్తీకదీపం క్లైమాక్స్.. అందరూ సర్ప్రైజ్ అవ్వడం ఖాయమంటున్న డాక్టర్ బాబు!

స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారెవరు లేరు.

ఇక ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతో ఇంతో కాదు.స్టార్ మా లో ఎక్కువ రేటింగ్ ఈ సీరియల్ నుండే వస్తుంది.

ఇందులో నటించే నటుల పాత్రలు.ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు ల గురించి తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడకుండా ఉండరు.

వీళ్లిద్దరు ఎప్పుడు కలుస్తారా అన్నట్లు ఎదురు చూస్తూ టీవీల ముందల వాలిపోతారు.డాక్టర్ బాబు గా నిరుపమ్ పరిటాల, వంటలక్క గా ప్రేమి విశ్వనాథ్ లు ఈ సీరియల్ లో ప్రధానపాత్రధారులుగా నటిస్తున్నారు.

ఈ సీరియల్ మొదటినుంచి రేటింగ్ విషయంలో ముందుంది.ఇదిలా ఉంటే వీళ్ళ బిడ్డలుగా సౌర్య, హిమా ల పాత్రలు మరింత ఆకట్టుకుంటాయి.

ఇటీవలే నటుడు నిరుపమ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కొన్ని విషయాలను తెలిపారు.

"""/"/ నిరుపమ్ ను తన వ్యక్తిగత విషయాలు తెలుపగా ప్రస్తుతం తన ఫేమ్ లో ఉన్న కార్తీకదీపం సీరియల్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.

దీంతో ఆ సీరియల్ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడగ్గా.

కార్తీకదీపం ఇంత ఆదరణ పొందడం సంతోషంగా ఉంది.ఈ సీరియల్ గురించి మరింత ఉత్సాహం కలుగుతుంది.

ఈ సీరియల్ లో ఉన్న క్యారెక్టర్ ఇంతకుముందు తీసిన క్యారెక్టర్ల కంటే భిన్నంగా ఉంది.

నిజానికి ఈ సీరియల్ ఇంత రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించుకోలేమని తెలిపారు.

అంతేకాకుండా క్లైమాక్స్ గురించి కొన్ని ప్రశ్నలు వేయగా దీపకు దగ్గరవుతారా లేక మోనిత ను పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా.

నిజానికి బయట ప్రేక్షకులకు ఈ సీరియల్ పట్ల చాలా ఎక్స్ పర్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయని తెలిపాడు.

ఈ సీరియల్ ను ఇష్టం వచ్చినట్లు తేడాగా, కొంచెం కొత్తగా చేయాలనుకుంటే.బయట ఉన్న ఈ సీరియల్ అభిమానులు బస్సులు,లారీలు వేసుకొని వచ్చేలా ఉన్నారని తెలిపారు.

ఈ సీరియల్ లో ఎవరికి న్యాయం చేయాలో వారికే చేస్తామంటూ తెలిపారు.కాగా ఈ సీరియల్ ఎన్ని కాలాలపాటు నడుస్తుందో తెలీదు కానీ.

పిల్లల పెళ్లిళ్లు అన్నట్లు ట్రీ ప్లానింగ్ ప్రస్తుత ఆలోచనలో లేదని తెలిపారు.నిరుపమ్ మాటలు బట్టి ఈ సీరియల్ లో వంటలక్కకు న్యాయం జరుగుతుందని అర్థమవుతుంది.

సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.. ఎమ్మెల్సీ దండె విఠల్