కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై( MP Prajwal Revanna ) జేడీఎస్ పార్టీ సస్పెండ్ వేటు వేసింది.

ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే రేవణ్ణపై లైంగిక ఆరోపణల వ్యవహారం కన్నడనాట పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలోనే ఆయనపై కేసు నమోదైంది.తాజాగా జేడీఎస్ నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు వేశారు.

మరోవైపు ప్రజ్వల్ కు సంబంధించినవి అని ఆరోపణలు వస్తున్న అసభ్యకర వీడియోల వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.

విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.