తుదిదశకు చేరిన కర్ణాటక పరిణామాలు

కర్ణాటక పరిణామాలు తుది దశకు చేరుకున్నాయి.కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా సీఎం ఎంపికపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది.

ఈ మేరకు రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్ లు ఖర్గేతో సమావేశం అయ్యారు.

ఈ భేటీకి కర్ణాటక ఇంఛార్జ్ సూర్జేవాలా కూడా హాజరయ్యారు.సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఖర్గే రాహుల్ గాంధీకి వివరించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో ఖర్గే, రాహుల్ గాంధీలు చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable