అమాయక వయసులో ఉచ్చులో పడిన బాలుడు చివరికి ఏం చేసాడంటే.. ?

ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ క్లాస్ పేరిట పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉంటున్న విషయం తెలిసిందే.

ఆ క్లాస్లు వినడం ఏంటో గానీ, ఈ సెల్ ఫోన్ వల్ల చేయకూడని పనులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కొందరు పిల్లలు సరైన మార్గంలో ఫోన్ ఉపయోగించకుండా ఈ అవకాశాన్ని చట్టవ్యతిరేక పనులకు ఉపయోగిస్తున్నట్లుగా బయటపడింది.

ప్రస్తుతం ఇలాగే ఓ పిల్లాడు అధికార పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ వివరాలు చూస్తే.కరీంనగర్‌కు చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నందు వల్ల అతని తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం సెల్‌ఫోన్‌ కొనిస్తే చివరకు ఓ ప్రముఖ పార్టీ చేతికి చిక్కి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్యకర ఫొటోలు, వీడియోలు పోస్టుచేసే స్థాయికి వెళ్లిపోయాడట.

అలా కొంతకాలానికి సొంతంగా యూట్యూట్‌ చానల్‌ను కూడా ఏర్పాటుచేసుకున్న ఆ బాలుడు మరింత రెచ్చిపోయి చివరకు పోలీసుల చేతికి చిక్కాడట.

ఈ క్రమంలో నిపుణులు, పోలీసులు ఈ అంశం పై మాట్లాడుతూ, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే తప్ప ఇలాంటి రాజకీయ సైబర్‌ బూచాళ్ల నుంచి పిల్లల్ని కాపాడుకోలేకమని సూచిస్తున్నారు.

కాబట్టి కరోనా తగ్గి, స్కూళ్లు మొదలైయ్యే వరకు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండటం తప్పనిసరని వెల్లడిస్తున్నారు.

సోదరుడి పెళ్లిలో డ్యాన్స్ తో అదరగొట్టిన సాయిపల్లవి.. ఈ విషయంలో గ్రేట్ అనాల్సిందే!