ముద్రగడ పద్మనాభం లేఖపై కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య సీరియస్..!!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ లేఖ రాయడం తెలిసిందే.

దీంతో ఆ లెటర్ పై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ ని దమ్ముంటే కాకినాడలో పోటీ చెయ్ అని ముద్రగడ సవాలు చేయడానికి తప్పు పట్టారు.

ఇదే సమయంలో ముద్రగడకు దమ్ముంటే సొంత నియోజకవర్గము నుండి ఇండిపెండెంట్ గా లేదా వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు.

వైసీపీ తరపున మాట్లాడి అబాసుపాలు కావద్దని హితవు పలికారు.మంత్రి పదవులకు ఆశపడో లేక ప్రలోభాలకి లొంగో అవినీతి చక్రవర్తి జగన్ మోహన్ రెడ్డికి ఉడిగం చేస్తున్న కొంతమంది కాపు నేతల లైన్ లో ముద్రగడ కూడా చేరినట్లు ఉందని జోగయ్య ఘాటుగా విమర్శించారు.

"""/" /   కాపుల కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు చిత్తశుద్ధితో చేసినవి అని నమ్మానని, కానీ అవి కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినవే అని అర్థమైందని జోగయ్య తాజాగా వ్యాఖ్యానించారు.

కాపుల రిజర్వేషన్ ఇవ్వలేనని అప్పట్లో వైయస్ జగన్ చేసిన ప్రకటనపై ముద్రగడ ఎందుకు స్పందించలేదని జోగయ్య నిలదీశారు.

అప్పట్లో తెర వెనుక వైసీపీకి మద్దతిచ్చి తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా నటించి పవన్ స్థాపించిన జనసేనకి సైతం కాపుల ఓట్లు పడకుండా చేసింది ముద్రగడ కాదా అని జోగయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.

వైఎస్ఆర్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానంలో సమర్థుడైన కాపు కులస్తుడిని పోటీలో దించడానికి జగన్ నీ ఒప్పించే దమ్ము మీకుందా అని ముద్రగడనీ హరిరామ జోగయ్య ప్రశ్నించారు.

మీరు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న అభియోగాలు జగన్ ని రక్షించడానికే అన్నట్టు ఉన్నాయని ముద్రగడ పద్మనాభం పై హరి రామ జోగయ్య సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్… వీడియో వైరల్…