కన్నా వ్యాఖ్యలు సరికాదు.. ఎంపీ జీవీఎల్ రియాక్షన్

ఏపీ బీజేపీకి షాక్ ఇస్తూ కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కన్నా రాజీనామాపై ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు.కన్నాకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని జీవీఎల్ తెలిపారు.

ఆయనకు జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదా ఇచ్చామన్నారు.సోమువీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని చెప్పారు.

రాజకీయ దురుద్దేశంతోనే కన్నా లక్ష్మీనారాయణ ఆ వ్యాఖ్యలు చేశారని జీవీఎల్ మండిపడ్డారు.

కెనడా : యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ సెనేట్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి