ఆమెతో కంఫర్ట్ గా అనిపించదన్న పీసీ శ్రీరామ్… తప్పుకోండి పర్లేదు అన్న కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు మహారాష్ట్ర సర్కార్ కి, అటు బాలీవుడ్ ప్రముఖులకి చెమటలు పట్టిస్తుంది.

సుశాంత్ ఇష్యూని సెంటర్ గా చేసుకొని ఫైట్ స్టార్ట్ చేసిన కంగనా ముందుగా బాలీవుడ్ మాఫియా, నెపోటిజం, డ్రగ్స్ కల్చర్ మీద ఫోకస్ పెట్టి, అందులో భాగస్వామ్యంగా ఉన్న అందరి పేర్లు బయటకి లాగింది.

ఒంటరిగానే కంగనా బాలీవుడ్ మాఫియాపై ఎదురుదాడి చేసింది.ఆమె దాడి నుంచి తప్పించుకోవాలంటే సైలెంట్ గా ఉండటం బెటర్ అనే నిర్ణయానికి బాలీవుడ్ లో చాలా మంది వచ్చేశారు.

అయితే కొంత మంది కంగనాపై మళ్ళీ విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ సైలెంట్ అయ్యేలా చేస్తుంది.

ఆమె ఎటాకింగ్ ని తట్టుకోవడం చాలా మందికి కష్టంగా మారింది.ప్రస్తుతం కంగనా డైరెక్ట్ గా మహారాష్ట్ర సర్కార్ తో కయ్యం పెట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ ఇష్యూ కారణంగా కంగనాతో పని చేయడానికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఆసక్తి చూపించడం లేదు.

ఇక తాజాగా తన కొత్త సినిమా విషయంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఇదే విషయాన్ని చిత్ర నిర్మాతలకి తెలియజేశారు.

కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం వలన ఓ చిత్రాన్ని తిరస్కరించాను.ఆమెతో పనిచేయాలంటే అసౌకర్యంగా ఫీలయ్యాను.

అదే విషయాన్ని చిత్ర నిర్మాతలకు చెప్పడంతో వారు పరిస్థితి అర్థం చేసుకున్నారు అంటూ పీసీ శ్రీరామ్ పేర్కొన్నాడు.

వెంటనే కంగనా స్పందిస్తూ మీలాంటి లెజండ్ తో వర్క్ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాను సర్.

ఇది నాకు పూర్తిగా నష్టం లాంటిదే.అయితే, నాతో పనిచేయడానికి అసౌకర్యంగా ఫీలయ్యేంత విషయం ఏమిటో నాకు తెలియడం లేదు.

కానీ మీరు సరైన నిర్ణయమే తీసుకున్నందుకు నాకు ఆనందంగానే వుంది.మీకు ఆల్ ది బెస్ట్ అంటూ స్మూత్ గా కౌంటర్ ఇచ్చింది.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్… ఓకే చెప్పిన అల్లు అర్జున్?