1 మిలియన్ మార్క్ ను అందుకున్న సందర్భంలో కంగనా రనౌత్ స్పెషల్ మెసేజ్ …!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తన అభిమానులకు మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ట్విట్టర్ లో అందించింది.

గత కొద్ది రోజుల కిందట నటి కంగానా రనౌత్ ట్విట్టర్ లో అడుగేశారు.

ఆమె ఖాతా తెరవడమే లేటు అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.ఖాతా తెరిచిన కొద్ది రోజుల్లోనే ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్ చేరింది.

దీంతో ఈ ముద్దుగుమ్మ తెగ సంబర పడిపోతుంది.ఈ ఆనంద క్షణంలో కంగనా తన అభిమానుల కోసం ప్రత్యేక వీడియోను రూపొందించింది.

ఈ వీడియోలో అభిమానులకు కొన్ని సూచనలు అందించింది.నటి కంగానా రనౌత్ మాట్లాడుతూ.

‘‘ ప్రపంచదేశాల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అత్యున్నతమైనవి.ఇక్కడి మహిళలకు సంప్రాదాయానికి విలువలు ఇస్తారు.

జీవితం మారేకొద్ది కొత్త తరంలో అడుగుపెడుతూనే ఉన్నాం.ఫ్యాషన్ ని స్వీకరించాలని కానీ మన ఆచార సంప్రదాయలను మరిచిపోవద్దు.

జాతీయవాదానికి నిజమైన అర్థం మన దేశం కోసం మనం కట్టుబడి ఉండటమే.’’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఫనేక్ అనే సంప్రదాయ దుస్తులను ధరించిన ఆమె సంప్రదాయ బద్ధంగా రెడీ అయింది.

విదేశాల సంప్రదాయాలను స్వాగతిస్తూ దేశ సంప్రదాయలను మర్చిపోవద్దంటూ అభిమానులకు మెసేజ్ ఇచ్చింది.ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన కంగనా ఎప్పుడు అభిమానులకు చేరువలోనే ఉన్నారు.

సోషల్ మీడియా ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.అయితే ఆమె ప్రస్తుతం తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ చిత్రమైన తలైవిలో నటిస్తోందని అందరికీ తెలిసిందే.

దర్శకుడు ఏ.ఎల్.

విజయ్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.వీబ్రి మీడియా అండ్ ఖర్మా మీడియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విష్ణువర్ధన్ ఇందూరీ, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

వైరల్ వీడియో: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. చివరికి..?