కళ్యాణ్‌ రామ్‌ ఎన్ని ఫ్లాప్‌లు పడ్డా కూడా మారడా.. మళ్లీ అదే తప్పు చేయబోతున్నాడు

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కాస్త మెల్లగా సినిమాలు చేస్తున్నాడు.గత ఏడాది వరుసగా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి, వచ్చిన సినిమా వచ్చినట్లుగా ఫ్లాప్‌ అవ్వడంతో కాస్త స్పీడ్‌ తగ్గించిన కళ్యాణ్‌ రామ్‌ తాజాగా 'తుగ్లక్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమా టైటిల్‌ చూస్తుంటేనే సినిమాపై ఆసక్తి కనిపించడం లేదు.ఇక సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అసలు సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో విషయం పక్కన పెడితే సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

తుగ్లక్‌కు వేణు మల్లిడి అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.వరుసగా ఫ్లాప్‌ అవుతున్నా కూడా కథ, దర్శకుడి విషయాల్లో ఈ నందమూరి హీరో అస్సలు జాగ్రత్తలు తీసుకోక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి దర్శకుడు అయితే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు అంటూ కొందరు దర్శకులు ఉన్నారు.

వారిని ఎంపిక చేసుకోకుండా పెద్దగా ఆసక్తి లేని దర్శకులను నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఎంపిక చేసుకోవడంపై నందమూరి ఫ్యాన్స్‌ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ పదే పదే సినిమాల ఎంపిక విషయంలో తప్పులు చేస్తున్నాడు.

తాజాగా మరోసారి అదే తప్పు చేశాడు.నితిన్‌తో 'శ్రీనివాస కళ్యాణం' అనే ఫ్లాప్‌ మూవీని తెరకెక్కించిన సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

శతమానం భవతి చిత్రంతో సతీష్‌ మెప్పించినా ఆ తర్వాత చేసిన సినిమా ఫ్లాప్‌ అయ్యింది.

అయినా కూడా కళ్యాణ్‌ రామ్‌కు ఆయనపై నమ్మకం ఉంది.అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు.

దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్‌ కథను కళ్యాణ్‌ రామ్‌ కోసం రెడీ చేశాడట.

మరి ఈ చిత్రం నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది కళ్యాణ్‌ రామ్‌ కు మరి కొద్ది రోజుల్లోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.

తుగ్లక్‌ మూవీ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం షూటింగ్‌ షురూ అవ్వనుందట.

ముద్రగడపై నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు..!!