ఏపీలో ఘోరం.. వైసీపీ నేత దారుణ హత్య.. ?

ఏపీలో వైసీపీ కార్పొరేటర్ హత్య కలకలం సృష్టిస్తుంది.కాకినాడ లో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే.

కాకినాడకు చెందిన తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అయిన కంపర రమేష్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో రెవెన్యూ కాలనీ కి చెందిన చిన్నా అనే వ్యక్తి, రమేష్ కు ఫోన్ చేసి మాట్లాడాలని ఉందని పిలిపించాడట.

చిన్నా పిలిచిన చోటుకు కార్పొరేటర్ రమేష్ వెళ్లేసరికి అక్కడ చిన్నాతో పాటుగా అతని సోదరుడు కుమార్ ఉన్నారట.

ఈ ముగ్గురు కలసి మద్యం సేవిస్తూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు గానీ హఠాత్తుగా కార్పొరేటర్ రమేష్ తన కారులో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్దుతగిలిన చిన్నా అతన్ని వెళ్లకుండా ఆపాడట.

ఇలా వారిద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో విచక్షణ కోల్పోయిన చిన్నా రమేష్ ని కార్ తో ఢీ కొట్టి మరీ హత్యచేశాడట.

"""/"/ అలా మొత్తం మీద మూడు సార్లు కారుతో తొక్కించి హత్యచేసిన చిన్నా ఆ తర్వాత అక్కడి నుండి పరారయ్యాడట.

ఇక రక్తపు మడుగులో పడివున్న రమేష్ ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని అక్కడి వైద్యులు తెలిపారట.

కాగా పోస్టుమార్టం నిమిత్తం రమేష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారట.

చిరంజీవి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన సినిమాలు ఇవే…