నా కొడుకే నా భర్తను చంపించాడన్న ప్రముఖ నటి.. ఏం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి.

కాకినాడ శ్యామల ప్రస్తుతం సినిమాలలో నటించకపోవడంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలామంది అభిమానులకు తెలియదు.

అయితే సొంత కొడుకే నా భర్తను చంపించాడంటూ ఈ నటి షాకింగ్ కామెంట్లు చేశారు.

మా ఆయన చనిపోవడమే నాకు బాధ అంటూ కాకినాడ శ్యామల ఎమోషనల్ అయ్యారు.

ఆ బాధ తప్ప నా జీవితంలో అంతకు మించిన బాధ మరేం లేదని ఆమె కామెంట్లు చేశారు.

భర్తను చంపినా చంపించినా ఆస్తిలో వాటా రాదని నాపై ఆ నింద వేశారని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు.

నాకు ఆస్తిలో వాటా రాకపోవడంతో లాయర్ తో చర్చించగా నాపై నింద వేశారని అర్థమైందని అయితే ఆ నింద నిజం కాదని నేను ప్రూవ్ చేసుకున్నానని ఆమె తెలిపారు.

ప్రూవ్ చేయడంతో పాటు మా ఆయనను చంపిన వ్యక్తికి 18 ఏళ్ల జైలు శిక్ష వేయించానని కాకినాడ శ్యామల పేర్కొన్నారు.

"""/"/ మా ఆయనను చంపేశారని ఆమె కామెంట్లు చేశారు.నన్ను కూడా చంపేయాలని అనుకున్నారని ఆమె అన్నారు.

మా ఆయన అన్న కొడుకు బాబ్జీ భర్తను చంపాడని కాకినాడ శ్యామల కామెంట్లు చేశారు.

ఇప్పటికీ ఆస్తిని అతనే తింటున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.నాకున్నదే భర్త అని అతనిని చంపుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

"""/"/ వరుసకు కొడుకు అయిన వ్యక్తే ప్రాణాలు తీశాడంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

నేను అనాథనని ఆమె ఎమోషనల్ అయ్యారు.పిల్లలు కూడా పుట్టలేదని కాకినాడ శ్యామల అన్నారు.

విధిరాతను ఎవరూ మార్చలేదని ఆమె తెలిపారు.నా చదువు కూడా వానాకాలం చదువేనని ఆమె అన్నారు.

నేను తప్పు చేయని పక్షంలో ఎందుకు భయపడాలని కాకినాడ శ్యామల కామెంట్లు చేశారు.

ఒమన్ : మొహర్రం ప్రార్ధనల్లో కాల్పులు.. ఆరుగురు దుర్మరణం, మృతుల్లో భారతీయుడు