కాజల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చందమామ!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.స్టార్ హీరోలతో మాత్రమే కాదు చిన్న హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా వరస అవకాశాలు అందుకుంటూ కుర్ర భామలకు పోటీ ఇస్తుంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా మొన్నటి వరకు అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ వచ్చింది.

ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ లో కూడా ఎంజాయ్ చేస్తుంది.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ స్పీడ్ పెంచింది.అయితే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మరేమీ సినిమాలు ఒప్పుకోవడం లేదు.

ఒప్పుకున్నా రెండు మూడు సినిమాలు నుండి కూడా తప్పుకుంది. """/"/ కాజల్ తల్లి కాబోతున్న నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఈమె మాతృత్వం లోని మాధుర్యన్ని ఆస్వాదిస్తోంది.ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు ఏదొక ఫోటో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

అయితే కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ తెలిసింది.ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.

కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది.కాజల్ మెగా బిడ్డకు జన్మనిచ్చినట్టు వార్త బయటకు వచ్చింది.

ఈ విషయాన్నీ కాజల్ జంట అధికారికంగా ప్రకటించలేదు.కానీ ఆమె సోదరి నిషా అగర్వాల్ మాత్రం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వల్ల ఈ విషయం బయటకు వచ్చింది.

''స్పెషల్ న్యూస్ ను మీ అందరితో పంచుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను'' అంటూ ఆమె పోస్ట్ చేసింది.

దీంతో కాజల్ కు బిడ్డ పుట్టినట్టు బయటకు వచ్చింది.ప్రెసెంట్ తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

తల్లిదండ్రులైనా కాజల్ అగర్వాల్ జంటకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెష్ చెబుతున్నారు.

ఇటలీలో దయనీయ స్ధితిలో భారతీయ కార్మికుడి మృతి .. రోజుల తర్వాత యజమాని అరెస్ట్