బాలకృష్ణ సినిమాలో చందమామ విషయంలో ఎందుకు ఇంత దాగుడుమూతలు

నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది.ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఏ సినిమా ప్రారంభించిన కూడా హీరోయిన్ విషయంలో సమస్య తలెత్తుతోంది.

ఒకరిద్దరి పేర్లు పదే పదే వినిపించి ఆ తర్వాత మరెవరో అన్నట్లుగా నటిస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతుంది.

ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ మరో వారం పది రోజుల్లో అనిల్ రావిపూడి సినిమా రెండవ షెడ్యూల్ కి డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆ లోపు హీరోయిన్ విషయం లో ఒక క్లారిటీ కి రావాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నాడు.

ముగ్గురు నలుగురు పేర్లను అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నాడట.అందులో కాజల్ అగర్వాల్ పేరు దాదాపుగా కన్ఫామ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

"""/"/ గతంలో చిరంజీవి తో కలిసి నటించిన కాజల్ అగర్వాల్ సక్సెస్ ను సొంతం చేసుకుంది.

కనుక బాలకృష్ణ తో కూడా ఆమె సెట్ అవుతుందని అంత భావిస్తున్నారు.బాలకృష్ణ కి కూడా కాజల్ అగర్వాల్ తో నటించాలనే ఆసక్తి ఉందని ప్రచారం జరుగుతుంది.

అయితే గతం లో బాలకృష్ణ సినిమా కు కాజల్ అగర్వాల్ నో చెప్పింది.

అప్పుడు ఉన్న కారణాలతో బాలయ్య సినిమా లో నటించేందుకు కాజల్ అంగీకరించక పోవడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.

ఇప్పుడు బాలకృష్ణ సినిమా లో కాజల్ అగర్వాల్ ని తీసుకుంటే నందమూరి అభిమానుల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఎంపిక చేసి కూడా అధికారికంగా ప్రకటించడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ మరియు కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్‌ లో సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని కొందరు అభిమానులు నమ్మకం తో ఉన్నారు.

గో బ్యాక్ టూ ఇండియా : అల్బేనియాలో భారత సంతతి మహిళపై జాత్యహంకార వ్యాఖ్యలు