ఆ లక్ష్యం కాంగ్రెస్‌లో ఉంటే ఎప్పటికి సాధ్యం కాదు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినా కూడా ఆయన గత కొన్ని నెలలుగా కినుకుతో ఉన్నాడు.

సమయం చూసుకుని ఆయన బీజేపీలో జాయిన్‌ అయ్యాడు.నిన్న మొన్నటి వరకు తాను పార్టీలో ఉంటాను అన్న సింధియా ఉన్నట్లుండి పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం కూడా అవాక్కయ్యిందట.

నేడు బీజేపీ చీప్‌ జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండుగ కప్పుకున్న సింధియా ఆ తర్వాత మాట్లాడుతూ.

దేశంను అభివృద్ది పథంలో నడిపించగల సత్తా కేవలం మోడీ అమిత్‌ షాలకు మాత్రమే ఉందని పేర్కొన్నాడు.

బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.కాంగ్రెస్‌ గతంలో మాదిరిగా లేదు.

ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం కాంగ్రెస్‌లో ఉంటే ఎప్పటికి నెరవేరదు.అందుకే తాను పార్టీ మారాల్చి వచ్చిందని అన్నాడు.

గతంలో మారిదిగా కాంగ్రెస్‌ లేదు మళ్లీ అధికారంలోని వచ్చే అవకాశాలు కూడా లేవంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఉద్యోగులు, నిరుద్యోగులకు చంద్రబాబు సంచలన హామీలు..!!