కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ..!!

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్( Justice Pinaki Chandraghose ) విచారణ జరుపుతున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో( BRK Bhavan ) ఇరిగేషన్ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ సమావేశం అయ్యారు.

ఇప్పటికే తొమ్మిది రకాల అంశాలపై ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించారు.అయితే ప్రాజెక్టుపై తనకు మరింత సమాచారం కావాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధికారులను కోరారని తెలుస్తోంది.

మరోవైపు ప్రశాంత్ జీవన్ పాటిల్ నోడల్ అధికారిగా తొమ్మిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.

ఈ క్రమంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిటీకి నోడల్ టీం సహాయకంగా పని చేయనుంది.

కాగా రేపు మేడిగడ్డ,( Medigadda ) అన్నారం( Annaram ) మరియు సుందిళ్ల బ్యారేజీలను జస్టిస్ చంద్రఘోష్ సందర్శించనున్నారు.

రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?