హరికృష్ణ జయంతి… భావోద్వేగానికి లోనైన తారక్!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నేడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.తన తండ్రి నందమూరి హరికృష్ణ 64వ జయంతి కావడంతో ఆయనను తలుచుకుంటూ మనస్సులోని భావాలను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు.

తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈరోజు ఉదయం మిస్ యూ నాన్నా అంటూ ట్వీట్ చేశారు.

రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే.

" ఈ అస్విత్వం మీరు.ఈ వ్యక్తిత్వం మీరు.

మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే.

- నందమూరి కల్యాణ్ రామ్ నందమూరి తారకరామారావు" అనే వాక్యాలతో నందమూరి హరికృష్ణ ఉన్న ఫోటోను ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.

నందమూరి హరికృష్ణ ఎన్నో సినిమాలలో నటించి హీరోగా సక్సెస్ కావడంతో పాటు రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారు.

తెలుగుజాతి ఆయనను చిరకాలం గుర్తుంచుకునే స్థాయికి ఎదిగారు.ఆయన నట వారసులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో నటిస్తోంది.

2021 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని భావించినా కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని టాలీవుడ్ వర్గాల సమచారం.

మీరు అన్ మ్యాచబుల్… రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన సమంత?