ఏపీ కోసం ఎన్టీఆర్‌ సాయం.. మంచి మనసున్న హీరో

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మరో సారి తన మంచి మనసును చాటుకున్నాడు.ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తాడు.

అలాగే మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.తాజాగా ఏపీలో వచ్చిన వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం చేకూరింది.

దాంతో ఆయన తన మంచి మనసుతో వారందరికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఏపీ ప్రభుత్వం నిర్వహించే సహాయ కార్యక్రమాలకు గాను తన వంతు సాయంగా 25 లక్షల ఆర్థిక సాయంను ప్రకటించాడు.

ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి గాను 25 లక్షలు ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.ఏపీలో వచ్చిన వరదలు మరియు ఇతర నష్టాలతో పెద్ద మొత్తంలో నష్టం చేకూరింది.

దాంతో ఇప్పుడు ప్రజలు అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వారందరికి కూడా సాయం చేసేందుకు టాలీవుడ్‌ వర్గాల వారు ముందుకు రావాలని కోరుకుందాం.

ఎప్పటిలాగే వరద సహాయం కోసం ఎన్టీఆర్‌ నుండి సాయం అందింది.ఇతర సినిమా ప్రముఖులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా తమ వంతు సాయం చేస్తారని అంతా ఆశిస్తున్నారు.

"""/" / ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను కూడా చేయబోతున్నాడు.మొత్తానికి ఎన్టీఆర్‌ ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఇదే సమయంలో ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షో తో మెప్పిస్తున్నాడు.అన్ని విధాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూ ఆపద సమయంలో సాయం చేస్తూ ఉన్నాడు.

 ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్‌ ల కాంబోలో సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అది ఎప్పుడు అనేది చూడాలి.

కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన టేస్టీ తేజ.. ముఖ్య అతిథిగా ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్?