రిపబ్లిక్ నుండి 'జోర్ సే' సాంగ్.. ఫుల్ జోష్ లో సాయి తేజ్ !

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్రిపబ్లిక్సి నిమా చేస్తున్నాడు.దేవ కట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

గత కొద్దీ రోజులుగా తన సినిమాలు ప్లాప్ అవ్వడంతో సాయి తేజ్ ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

అయితే ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 1న థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసారు.ఇటీవలే థాంక్యూ కలెక్టర్'' అనే కొత్త అనౌన్స్ మెంట్ చేసారు.

అలానే గాన ఆఫ్ రిపబ్లిక్అనే ఫస్ట్ లిరికల్ వీడియో కూడా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

"""/"/ ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ కూడా విడుదల చేసింది.జోర్ సే సాంగ్ తో సాయి తేజ్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ పాటలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ జోష్ గా కనిపించదు ఈ మాస్ సాంగ్ కు మణిశర్మ సంగీతం అందించాడు.

ఎనర్జిటిక్ గా సాగిన ఈ పాటకు స్టెప్స్ కూడా సాయి తేజ్ ఇరగదీసినట్టే కనిపిస్తుంది.

ఇక ఈ పాటలో ఐశ్వర్య రాజేష్ కూడా కనిపించింది. """/"/ ఈ సందర్భంగా సాయి తేజ్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసాడు.

చాలా రోజుల తర్వాత జోర్ సే సాంగ్ ద్వారా మళ్ళీ హార్ట్ ఫుల్ గా డాన్స్ చేసే అవకాశం వచ్చిందని ఇది అందరికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా అంటూ సాయి తేజ్ ట్వీట్ చేసాడు.

జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.

ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె.భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో వేచి చూడాలి.

పెన్షన్ల జమపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం