ఏపీ, తెలంగాణలో ఉద్యోగాలు..జియో నెట్వర్క్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. !
TeluguStop.com

దేశంలో నిరుద్యోగం ఏ స్దాయిలో ఉందో ఉద్యోగం కోసం ఎదురుచూసే వారిని అడిగితే తెలుస్తుంది.


ప్రస్తుత పరిస్దితుల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు.


ఇలాంటి సమయంలో ఏ ఉద్యోగానికైనా నోటిఫికేషన్ పడితే చాలు భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి.
ఈ కాలంలో ఉద్యోగం కోసం ఎదురుచూసే బదులు ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుండుందని ఆలోచించే వారు కూడా లేకపోలేదు.
ఇంతటి విపత్కర పరిస్దితుల్లో ఏపీ, తెలంగాణలో జియో పాయింట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారి చేసింది.
కాగా జీతభత్యాలు కూడా మరీ అధ్వాన్నంగా లేకుండా చెప్పుకునే స్దాయిలో అంటే సంవత్సరానికి రూ.
2,40,000 నుంచి రూ.3,60,000 వరకు జీతం ఉంటుందని వెల్లడిస్తున్నారు జియో అధికారులు.
ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్ధులకు డిగ్రీ అర్హతతో పాటుగా మార్కెటింగ్ లేదా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో 8 నెలల అనుభవం ఉండాలి.
కాగా మరిన్ని వివరాలకు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి.
తెలంగాణ: Https://youtu!--be/2dOM-zETZgk
ఏపీ: Https://youtu!--be/6JPmh0OjE5E-.
అయ్యబాబోయ్.. వెన్నులో వణుకు పుట్టించే సీన్! క్షణకాలంలో ప్రాణం బలి..