పవన్ కళ్యాణ్ కర్నూల్ టూర్ ని అడ్డుకుంటారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కర్నూల్ లో భారీ ర్యాలీ, బహిరంగ సభ పెట్టడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

రెండేళ్ళ క్రితం అత్యాచారంకి గురై హత్య చేయబడ్డ సుగాలి ప్రీతీ అనే మైనర్ బాలికకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ ర్యాలీ, బహిరంగ సభ పెట్టారు.

ఇది ఓ సోషల్ కాజ్ కోసం చేస్తున్నాడు.అయితే రాయలసీమ అభివృద్ధిని పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని, ఈ పర్యటనని అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్ధి జేఏసి పిలుపునిచ్చింది.

కచ్చితంగా రాయలసీమ సత్తా పవన్ కళ్యాణ్ కి చూపిస్తాం అంటూ ఇప్పటికే హెచ్చరికలు చేశారు.

అలాగే ఎస్పీని కలిసి ఈ పర్యటనకి అనుమతి ఇవ్వొద్దు అంటూ హంగామా చేశారు.

అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించనున్నారు.దీనికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

అయితే ఒక విద్యార్ధిని జరిగిన అత్యాచారం, హత్యాపై పోరాటం చేస్తుంటే అడ్డుకోవడం ఏంటి అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ర్యాలీని ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జనసేన కార్యకర్తలు కూడా అంతే దీటుగా సమాధానం చెప్పారు.

అలాగే ఈ ర్యాలీకి కుల సంఘాల మద్దతు కూడా ఉండటంతో విద్యార్ధి జేఏసి కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే పవన్ కళ్యాణ్ పర్యటనని అమరావతిలో భారీ పోలీస్ యంత్రాంగం కూడా అడ్డుకోలేకపోయింది.

గతంలో అతనికి ఎక్కడ ఎలాంటి నిరసనలు ఎదురుకాలేదు.మరి విద్యార్ధి జేఏసీ అన్న మాట ప్రకారం పవన్ కళ్యాణ్ పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేయగలరా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్27, శనివారం 2024