ఆ డైరెక్టర్ కు నిర్మాత దిల్ రాజు ఝలక్.. ఏం చేశారో తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు వరుసగా సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఆర్సీ 15 సినిమాను భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.
ఈ సినిమాతో పాటుగా తమిళ హీరో విజయ్ దళపతి నటిస్తున్న వారసుడు సినిమాను కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
అటు కోలీవుడ్ సినిమాని ఇటు టాలీవుడ్ సినిమాని రెండు సినిమాలను భారీ బడ్జెట్ తెరకెక్కిక్కిస్తున్నారు.
కాగా జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతం తిన్న నూరి ఒక కథను నిర్మాత దిల్ రాజుకు వినిపించారట.
అయితే ఆ సినిమా తన బ్యానర్ లో చేద్దామని నిర్మాత దిల్ రాజు గౌతమ్ కి మాట ఇచ్చాడట.
కానీ గౌతమ్ తిన్న నూరికి నిర్మాత దిల్ రాజు షాక్ ఇచ్చినట్టుగా సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
గౌతమ్ తిన్న నూరి ముందుగా చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా దిల్ రాజు కోరాడంతో గౌతమ్ తిన్న నూరి కూడా దిల్ రాజు చెప్పిన విధంగా కథలో మార్పులు చేశాడట.
"""/"/
అయినా కూడా దిల్ రాజుకు ఈ కథ పూర్తిగా నచ్చలేదని తెలుస్తోంది.
దీంతో గౌతమ్ తిన్ననూరి కు దిల్ రాజు బ్యానర్లో సినిమా చేసే అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మరి దిల్ రాజు నిజంగానే జెర్సీ డైరెక్టర్కు ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
అమెరికన్ టౌన్లో సాలెపురుగుల ప్రేమ కథ.. చూసేందుకు తండోపతండాలుగా వస్తున్న జనం..?