దృశ్యం సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఒరిజినల్ దర్శకుడు

మలయాళంలో మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ లో దృశ్యం సినిమాని జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించారు.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు సుమారు అన్ని ప్రాంతీయ భాషలలో రీమేక్ అయ్యింది.

అలాగే హిందీతో పాటు, చైనా, సింహళీ భాషలలో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యింది.

ఇక అన్ని భాషలలో సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఒక కామన్ మెన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు నేది ఇందులో కథాంశం.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మలయాళీ సినిమాకి సీక్వెల్ ని ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించే పనిలో ఉన్నారు.

ఇక ఈ సీక్వెల్ లో మొదటి భాగంలో నటించిన మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో నటించనున్నారు.

మిగిలిన పాత్రలతో పాటు కథ మొత్తం మారిపోతుందని తెలుస్తుంది.మొదటి సినిమా తరహాలో ఇది కూడా ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలతో తెరకెక్కే థ్రిల్లర్ కథగానే ఉంటుందని తెలుస్తుంది.

మరి మొదటి సినిమా తరహాలో ఈ సీక్వెల్ కూడా అద్భుతమైన విజయం అందుకుంటుందో లేదో చూడాలి.

వైసీపీ మ్యానిఫెస్టో -2024.. వచ్చే ఐదేళ్లు సుపరిపాలన