తాడిపత్రి డీఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు

అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తాడిపత్రిలో డీఎస్పీ వలనే శాంతి భద్రతలు లోపిస్తున్నాయని ఆరోపించారు.ఎమ్మెల్యేకి తొత్తుగా మారి టీడీపీ నేతలను వేధిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

టీడీపీ ఏ కార్యక్రమం చేసినా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.ఇకపై తన ఇంట్లోకి వస్తే సహించేది లేదని పేర్కొన్నారు.

తన చేతికి ఏది దొరికితే దానితోనే తిరగబడతానని చెప్పారు.ఈ క్రమంలో డీఎస్పీ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

ఐకాన్ స్టార్ తో మల్టీస్టారర్… నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!