ఆ పని చేసే అంత డబ్బు నా దగ్గర లేదు.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!

దివంగత నటి శ్రీదేవి( Sridevi ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ).

ఈమె హీరోయిన్గా ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.త్వరలోనే ఈమె ఉలగ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి ఈమె తన గురించి పలు విషయాలను వెల్లడించారు.

"""/" / ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు డబ్బులు ఇచ్చి మరి పొగిడించుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ వార్తలపై ఈమె స్పందిస్తూ.డబ్బులు ఇచ్చి పొగిడించుకునే మనస్తత్వం నాది కాదని తెలిపారు.

ఒక నటిగా నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాననే విషయాన్ని నిర్ణయించాల్సింది ప్రేక్షకులు.వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ అవకాశాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడం మాత్రమే మన చేతులలో ఉందని తెలిపారు.

"""/" / ప్రస్తుతం సోషల్ మీడియాలో మనల్ని కొందరు పొగుడుతూ ఉంటే మరికొందరు తిడుతూ ఉంటారు.

ఇలా ఎవరైతే నన్ను పొగుడుతూ ఉన్నారో వారందరూ కూడా నా పీఆర్ టీమ్ అని  భావిస్తున్నారు.

ఒక మాటలో చెప్పాలి అంటే ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను ఎందుకంటే డబ్బులు ఇచ్చి పొగిడించుకొనే అంతా డబ్బు నా దగ్గర లేదు అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి మనకు తెలిసిన త్వరలోనే ఎన్టీఆర్ ( NTR ) సరసన నటించిన దేవర సినిమా( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు  ఈ సినిమా అనంతరం రామ్ చరణ్(Ram Charan) సరసన కూడా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

నా ఆర్డర్‌ భయ్యా.. నువ్వు తినేస్తున్నావేంటి..? రెడ్ హ్యాండెడ్ గా దొరికిన డెలివరీ బాయ్..