అమ్మ నాతో గడిపిన చివరి క్షణాలు ఇవే… జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్?

అందాల తార దివంగత శ్రీదేవి ( Sridevi )అకాల మరణం ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు తీరని లోటు అని చెప్పాలి.

ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.

ఇక శ్రీదేవి మరణం తన కుమార్తె జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) సినిమాలలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా బాలీవుడ్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు.

అలాగే ఎన్టీఆర్ ( NTR )హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara Movie ) లో నటించే అవకాశాన్ని అందుకొని సౌత్ ఇండస్ట్రీకి కూడా ఈమె హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు.

ఇకపోతే తాజాగా జాన్వీకపూర్ సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

"""/" / 2018 దుబాయిలో( Dubai ) శ్రీదేవి అకాల మరణం అందరిని ఎంతగానో కృంగతీసింది అయితే తనతల్లి మరణం తమ జీవితంలో ఎప్పటికీ తీరని లోటని ఆస్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని జాన్వీ కపూర్ వెల్లడించారు.

ఇకపోతే తన తల్లితో తాను గడిపిన చివరి క్షణాలను అలాగే చివరిగా తన తల్లి తనతో మాట్లాడిన మాటల గురించి కూడా తాజాగా ఈమె తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

శ్రీదేవి మరణించే సమయానికి ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ధడక్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇలా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఈమెకు తన తల్లితో గడిపే సమయం లేకుండా పోయింది.

అయితే రేపు దుబాయ్ ప్రయాణం అనగా తన తల్లి రూమ్ కి వెళ్లినటువంటి శ్రీదేవి లగేజ్ ప్యాక్ చేస్తే బిజీగా కనిపించారట.

"""/" / ఇక తన తల్లి బిజీగా ఉండటంతో తిరిగి జాన్వి తన గదికి వెళ్లారట.

లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత శ్రీదేవి తన కుమార్తె గదికి వెళ్ళగా అప్పటికే జాన్వీ పడుకొని ఉన్నారు.

అయితే అమ్మ అక్కడే ఉన్నారనే విషయం నాకు తెలుసు తన పనులన్నింటినీ ముగించుకొని నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని నా తలపై తన చేతులు వేసి అక్కడే కూర్చున్నారు.

ఇదే అమ్మ నాతో గడిపిన చివరి క్షణాలు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబం మొత్తం ఒకటైంది కాకపోతే అమ్మలేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..