జనసేన పార్టీ అభ్యర్ధుల కోసం జోరుగా సాగుతున్న స్క్రీనింగ్!

రెగ్యులర్ పొలిటికల్ పార్టీలకి భిన్నంగా ఏపీ రాజకీయాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జనసేన పార్టీ తన ప్రయాణం వేగవంతం చేసింది.

ఓ వైపు పార్టీలో విద్యావంతులు చేరికలు వేగం అవుతూ వుంటే, మరో వైపు పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం స్క్రీనింగ్ టెస్ట్ జోరుగా సాగుతుంది.

యువతరం అధిక సంఖ్యలో ముందుకొచ్చి జనసేన పార్టీ తరుపున పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఇప్పటికే జిల్లా కమిటీలు ఏర్పాటు చేసిన జనసేనాని, రాజకీయ కార్యాచరణ కూడా సిద్ధం చేసారు.

మరో వైపు జనసేనాని పార్టీ కార్యకలాపాలలో బిజీగా వుండటంతో ప్రజల మధ్యకి వెళ్ళడం లేదు.

ఇదిలా వుంటే ఓ వైపు తెలుగు దేశం పార్టీ, అలాగే వైసీపీ పార్టీలలో నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ అధినేతలతో సీట్ల కోసం చర్చిస్తూ, జంపింగ్ లు స్టార్ట్ చేసారు.

మీడియా కూడా వీటినే ప్రముఖంగా చూపిస్తుంది.అయితే ఇలాంటి జంపింగ్ లకి దూరంగా వున్నా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం స్క్రీనింగ్ చేసుకుంటూ వుంది.

దీంతో రాజకీయంగా జనసేన పార్టీ గురించి పెద్దగా చర్చకు రావడం లేదు.అయితే జనసేనాని లాంగ్ టర్మ్ కార్యాచరణలో పూర్తిగా నిమగ్నమై వంద రోజుల కార్యక్రమాలు మొదలు పెట్టి అందులో అభ్యర్ధుల ఎంపిక వరకు వచ్చారు.

మరి ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ వర్గాలలో వేది రాజుకుంటుంది.ఇలాంటి పరిస్థితి లో జనసేనాని జనాల మధ్యకి వెళ్లి ఎలక్షన్ కోసం ఫుల్ యాక్టివ్ అవ్వాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరి దీనిపై జనసేన పార్టీ వర్గాలు ఎలా ముందుకు వెళ్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హీరో అజిత్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన భార్య షాలిని.. అసలేం జరిగిందంటే?