రేవంత్ పై జానారెడ్డి ఫైర్…అసలు కారణం ఇదే?

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనంగా మారుతున్న విషయం తెలిసిందే.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో విఫలం అవుతుండడంతో ప్రజలు ఇటు దుబ్బాక ఎన్నికలలో, గ్రేటర్ ఎన్నికలో ఓట్లతో ఓటమి దెబ్బ రుచి చూపించారు.

కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం ఏంటని ఒక్కసారి గమనిస్తే గ్రూపు రాజకీయాలు అని రాజకీయాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్న వ్యక్తి కూడా చెబుతాడు.

కాని ప్రతి ఎన్నికలో ఓటములు పలకరిస్తున్నా కూడా ఓటమిపై సమీక్ష జరపకుండా, అందరూ ఒక్కటిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడదామనే ఆలోచనలో ఏ కాంగ్రెస్ నేత ఉండకపోవడం కాంగ్రెస్ కార్యకర్తలను ఆందోళన కలిగిస్తున్న విషయం.

అయితే తాజాగా జానారెడ్డి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా చురకలంటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే రేవంత్ రెడ్డి వర్గం కొంత మంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటంతో ఈ విషయం సీనియర్ నేత జానారెడ్డి దృష్టికి రావడంతో జానా ఫైర్ అయ్యారు.

సొంత పార్టీకి వ్యతిరేకంగా ఇలా పోస్టులు పెడితే ప్రజల్లో మరింత పలుచబడుతామని, ఇలాంటివి ఇంకా కొనసాగిస్తే హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తానని జానారెడ్డి ఘాటుగా హెచ్చరించారు.

ఏది ఏమైనా కాంగ్రెస్ ను ఇతర పార్టీలు బలహీన పరిచే అవకాశం ఇవ్వకుండా తమకు తాముగా బలహీనపరుచుకుంటున్నారని ఇతర పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ సినిమాను అవసరమైతే యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనుకున్నా.. పవన్ సంచలన వ్యాఖ్యలు!