నెల్లూరు జిల్లాలో యనాదుల సంఘం జలదీక్ష.. నెలకొన్న ఉద్రిక్తత

నెల్లూరు జిల్లాలో కండలేరు మత్స్య సంపదను వేలం వేయొద్దంటూ యానాదుల సంఘం జలదీక్ష కార్యక్రమం చేపట్టింది.

కండలేరు, కనిగిరి రిజర్వాయర్ సహా 15 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెబుతున్నారు.ఈ క్రమంలో జలదీక్ష చేస్తున్న యానాదుల సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులతో నేతలు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అఫీషియల్… చరణ్ గేమ్ చేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్… ఎప్పుడంటే?