కోర్టు ధిక్కరణ కేసులో ఉన్నతాధికారులకు జైలు శిక్ష..!

కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.సర్వీస్ అంశాలపై గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని దాఖలైన ధిక్కరణ కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

తీర్పు నేపథ్యంలో వెంటనే హైకోర్టుకు చేరుకున్న అధికారులు క్షమాపణ చెప్పారు.దీంతో తీర్పును సవరించిన ధర్మాసనం సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశించింది.

ఐఏఎస్ అధికారి, ప్రస్తుత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణలకు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.

2 వేల చొప్పున జరిమానా విధించింది.ఈ క్రమంలోనే ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇరువురు గతంలో ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కోర్టు తీర్పును అమలు చేయలేదని వారు అభియోగాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో తాజాగా హైకోర్టు తీర్పును వెలువరించింది.

మేడ్చల్ జిల్లాలో షాకింగ్ యాక్సిడెంట్.. వీడియో వైరల్..