మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమాన,జైలు రెండూ తప్పవు:ట్రాఫిక్ సిఐ బి.డానియల్‌

నల్లగొండ జిల్లా:మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని నల్లగొండ ట్రాఫిక్ సిఐ బి.

డానియల్‌ కుమార్ హెచ్చరించారు.శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్( Drunk And Drive ) పరీక్షల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 34 మందిని నల్లగొండ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని,వీరిలో ఒకరికి 5 రోజులు, ఒకరికి 2 రోజులు, నలుగురికి 1 రోజు జైలు శిక్ష విధించగా,మిగిలిన 28 మందికి రూ.

30 వేల జరిమానా విధించారని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ గింజలను తప్పక తీసుకోండి!