ఈనెల 14న జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ

మంచిర్యాల జిల్లాలో ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ జరగనుంది.

ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు అవుతారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ తెలిపారు.

బీజేపీ మత రాజకీయాలపై ప్రశ్నించడమే సభ ముఖ్య ఉద్దేశ్యమని మహేశ్ గౌడ్ వెల్లడించారు.

తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకరినొకరు సహకరించుకుంటున్నాయని వెల్లడించారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవలేని బీఆర్ఎస్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు టెండర్లు వేస్తారా అని ప్రశ్నించారు.

వైరల్ వీడియో: పార్టీలో డ్యాన్స్ వేస్తూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన వ్యక్తి.. చివరకు.?