JD Lakshmi Narayana : ఎమ్మెల్యేగా జేడి పోటీ .. ఏ నియోజకవర్గం అంటే ?

సిబిఐ మాజీ జేడీ,  జై భారత్ పార్టీ( Jai Bharat Party ) అధినేత జెడి లక్ష్మీనారాయణ( JD Lakshmi Narayana ) వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మొన్నటి వరకు విశాఖ ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉంటూ వచ్చిన జేడి ఇప్పుడు మనసు మార్చుకుని ఎమ్మెల్యే గానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు గత కొంతకాలంగా ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం పై( Vizag North Constituency ) ఎక్కువ ఫోకస్ పెట్టారు .

అక్కడి నుంచే పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు .ఎక్కువగా ఉత్తర నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం,  మేధావి వర్గం తనక మద్దతుగా నిలుస్తుందని జేడి అంచనా వేస్తున్నారు.

"""/" / దీనికి తగ్గట్లుగానే విశాఖ ఎంపీగా గతంలో పోటీ చేసిన లక్ష్మీనారాయణకు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓట్లు నమోదు కావడం,  ఆ ఓటు బ్యాంకు అలాగే ఉండడంతో ఈ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ( MLA ) పోటీ చేస్తే .

తన గెలుపు ఖాయం అనే అంచనాతో జేడీ ఉన్నారు.ఉత్తర నియోజకవర్గంలో 2.

87 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ,టిడిపి అభ్యర్థులు గెలుపొందారు.

ఈ నియోజకవర్గంలో వైసిపి బలహీనంగా ఉంది.నియోజకవర్గాల పునర్వైభజన  తరువాత 2009లో ఏర్పడిన ఉత్తర నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ కుమార్ గెలుపొందారు.

"""/" / 2014లో బిజెపి అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజు సాధించారు.2019లో టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) గెలిచారు.

గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి పరాజయం చెందారు.ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అధికార పార్టీ వైసీపీ నుంచి కేకే రాజు ఎన్నికల బరిలో ఉన్నారు.

  టిడిపి , జనసేన,  బిజెపి కూటమి అభ్యర్థిగా బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు.

ఇప్పుడు జేడీ కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతూ ఉండడం తో ఈ నియోజకవర్గం పై అందరి దృష్టి పడింది.

ఓరి దేవుడో.. కిమ్ జోంగ్ ఉన్ భార్య ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తుందా..