జగన్ సర్కారు మాత్రం ప్రధాని పర్యటన పేరిట కూల్చివేతలు సాగిస్తున్నారు..పురంధేశ్వరి

15వేల కోట్లకు మించిన కేంద్ర పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి.

ప్రధాని నిర్మాణం కోసం వస్తుంటే జగన్ సర్కారు మాత్రం ప్రధాని పర్యటన పేరిట కూల్చివేతలు సాగిస్తున్నారు.

కనీసం నోటీసులు ఇవ్వకుండా, టైము ఇవ్వకుండా పేదల ఇళ్లు, షాపులు కూల్చారు.మరి భూకబ్జాలు చేసిన వారి‌మీద ఎందుకు అలా చర్యలు తీసుకోరు ఈ విధ్వంసానికి బెదిరిపోయి రాష్ట్రంలోకి పెట్టుబడిదార్లు రావటం లేదు.

దిల్లీ లిక్కర్ స్కాములో ఈ రోజు అరెస్టయిన వారు ఎవరికి దగ్గరవారు? శరత్ చంద్రారెడ్డి ఎవరి మనిషి? అరవిందో ఎవరిది సీఎం రమేష్ కామెంట్స్ విశాఖ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తూ కబ్జాలు చేస్తున్నారు.

దసపల్లా భూముల కుంభకోణం మీద సిబి ఇడిలకు ఫిర్యాదు చేస్తాం.ప్రజలు వీటిలో ఫ్లాట్లు కొంటే నష్టపోతారు.

కనుక కొనద్దు ప్రధాని పర్యటనలో దొంగల హడావిడి ఎక్కువైంది.ఆయన అన్నీ గమనిస్తారు.

అవినీతి అక్రమాలూ సహకంచరు.దిల్లీలో సతీష్ అరెస్టే ఇందుకు నిదర్శనం.