నేనంటే జగన్, వైసీపీ నేతలకు భయం..: లోకేశ్

గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు టీడీపీ నేత నారా లోకేశ్ హాజరయ్యారు.ఈ క్రమంలో తనపై ఆరోపణలు చేసిన వారిపై లోకేశ్ పరువు నష్టం కేసు వేశారు.

ఇందులో భాగంగా వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ, సింగలూరు శాంతి ప్రసాద్ పై లోకేశ్ కేసులు వేశారు.

అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ పెత్తందారులపై తన పోరాటమని తెలిపారు.తనపై ఆరోపణలు చేశారన్న ఆయన న్యాయం కోసం కోర్టుకు వచ్చినట్లు పేర్కొన్నారు.

తాను విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా చాలని తెలిపారు.జగన్ విదేశాలకు వెళ్లాలంటే ఈడీ, సీబీఐ కోర్టు పర్మిషన్ లు కావాలన్నారు.

ప్రతి సంవత్సరం ఆస్తుల లెక్క చెప్తున్నామన్న లోకేశ్ తనపై ఆరోపణలు చేసిన వారు నిరూపించుకోవాలని తెలిపారు.

లోకేశ్ అంటే జగన్, వైసీపీ నేతలకు భయమన్నారు.మంగళగిరి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబే సీఎం అవుతారని స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు తర్వాత 13 ఫ్లాపులు.. సూపర్ స్టార్ కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్!