పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల సంస్మరణ దినోత్సవం లో సీఎం జగన్ పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూదేశవ్యాప్తంగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం గత 22 సంవత్సరాలుగా జరుపుకున్నట్లు పేర్కొన్నారు.

ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైన అయితే అందులో 11 మంది మన రాష్ట్రానికి చెందిన వారని పేర్కొన్నారు.

అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.ఇంకా అనేక విషయాల గురించి సీఎం జగన్ మాట్లాడగా గతంలో పోలీసులకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వాలని రీతిలో వీక్లీ ఆఫ్ ప్రకటించడం జరిగింది.

అయితే మధ్యలో మహమ్మారి కరోనా కారణంగాపోలీసులు నిరంతరం సెలవు లేకుండా పని చేస్తున్నారు కానీ నేటి నుండి మళ్లీ వీక్లీ ఆఫ్ అమలులోకి తీసుకొస్తున్నట్లు పోలీసులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు.

 అదే రీతిలో రానున్న రోజుల్లో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

కంగువ మూవీ స్టోరీ ఇదేనా.. సూర్య వర్సెస్ సూర్య అనే విధంగా ఉండబోతుందా?