బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు ఎయిర్ పోర్ట్ లో షాక్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ముంబై విమానాశ్రయంలో ఊహించని షాక్ ఎదురయ్యింది.

ఇండియా నుంచి వెళుతున్న జాక్వెలిన్ ను ముంబై ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు.

ఈమె రెండు వందల కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు సుఖేష్ చంద్ర శేఖర్ తో కలిసి సన్నిహితంగా దిగిన ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈమె చిక్కుల్లో పడినట్లు అయింది.

అప్పట్లో జాక్వెలిన్ మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న విషయం అందరికి తెలిసిందే.

ఆ సమయంలో ఆమె సుఖేష్ చంద్రశేఖర్ కు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కొట్టిపారేసింది.

ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత ఆమె చంద్రశేఖర్ ను ముద్దుపెట్టుకుంటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అంతకుముందు 200 కోట్ల దీనికి సంబంధించి ఈడి జాక్వెలిన్, నోరా ఫతేహి, చంద్రశేఖర్, భార్య లీనాపాల్ కు సమన్లు జారీ చేసింది.

"""/" / జాక్వెలిన్, చంద్రశేఖర్ నాలుగుసార్లు చెన్నైలో కలిశారని పలు నివేదికల ప్రకారం సమాచారం.

జాక్వెలిన్ కోసం చంద్రశేఖర్ ప్రైవేట్ జెట్ ను కూడా ఏర్పాటు చేశారట.చంద్రశేఖర్ నుంచి కోట్ల రూపాయల బహుమతిని జాక్వెలిన్ పొందినట్లు ఈడి విచారణలో తేలింది.

అందులో భాగంగానే 52 లక్షల గుర్రం, తొమ్మిది లక్షలు పెర్షియన్ పిల్లి, అలాగే 10 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

జాక్వెలిన్ కు చంద్రశేఖర్ భార్య నాతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్ నటి నోరాకి చంద్రశేఖర్ భారీగా కోట్ల రూపాయలు విలువ చేసే గిఫ్ట్ లు ఇచ్చారని సమాచారం.

జక్కన్న రాసి ఇచ్చిన లెటర్ ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. ఆ లేఖలో ఏముందంటే?